వైభవంగా శ్రావణ పౌర్ణమి వేడుకలు..

ABN , First Publish Date - 2022-08-12T05:13:16+05:30 IST

వాల్మీకిపురం పట్టణంలో గురువారం శ్రావణ పౌర్ణమి వేడుకలు ఎంతో వైభవంగా నిర్వహించారు.

వైభవంగా శ్రావణ పౌర్ణమి వేడుకలు..
సామూహిక సత్యనారాయణ స్వామి వేడుకల్లో పాల్గొన్న భక్తులు

వాల్మీకిపురం, ఆగస్టు 11: వాల్మీకిపురం పట్టణంలో గురువారం శ్రావణ పౌర్ణమి వేడుకలు ఎంతో వైభవంగా నిర్వహించారు. పట్టణ పడమర పొలిమేరల్లోని ధర్మపథంలో వెలసిన అభయాం జనేయస్వామి దేవాలయంలోని ధ్యాన షిరిడిసాయిబాబా విగ్ర హానికి అభిషేకం, అర్చన, విశేష అలంకరణలతో పూజలు నిర్వ హించారు. సాయంత్రం అభయాంజనేయస్వామికి పున్నమి వెలుగులో తోమాల, వడమాల ఆకుపూజలు నిర్వహించి మొక్కు లు తీర్చుకున్నారు. అనంత రం రాత్రికి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వారి వేడుకలు నిర్వహించారు. చివరగా హోమాధి కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థ, అన్న ప్రసాద వితరణ చేపట్టారు. అలాగే స్థానిక సాయినగర్‌లోని  షిరిడిసా యిబాబా మందిరంలో శ్రావణపౌర్ణమి వేడుకలు, సత్యనారాయ ణ వ్రత వేడకలు జరిగాయి.  కార్యక్రమాలలో అర్చకులు సాలిగ్రామ శ్రీనివాసాచార్యులు, హరిస్వామి, ఆలయాల ట్రస్టు సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-12T05:13:16+05:30 IST