బాబోయ్‌... ఈ కరెంట్‌ బిల్స్‌ ఏంటి?

ABN , First Publish Date - 2020-06-28T05:30:00+05:30 IST

‘‘బాబోయ్‌! ఇప్పుడీ కరెంట్‌ బిల్స్‌ ఏంటి? పిచ్చి ఎక్కిస్తున్నాయ్‌!’’ అని కథానాయిక శ్రద్ధా దాస్‌ అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడీ బెంగాలీ బ్యూటీ మంబయ్‌లో ఉన్నారు. లాక్‌డౌన్‌ వల్ల ఎక్కడికీ వెళ్లడం లేదు...

బాబోయ్‌... ఈ కరెంట్‌ బిల్స్‌ ఏంటి?

‘‘బాబోయ్‌! ఇప్పుడీ కరెంట్‌ బిల్స్‌  ఏంటి? పిచ్చి ఎక్కిస్తున్నాయ్‌!’’ అని కథానాయిక శ్రద్ధా దాస్‌ అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడీ బెంగాలీ బ్యూటీ మంబయ్‌లో ఉన్నారు. లాక్‌డౌన్‌ వల్ల ఎక్కడికీ వెళ్లడం లేదు. ఫ్లాట్‌కి పరిమితమయ్యారు. తాజాగా వచ్చిన కరెంట్‌ బిల్‌ పిచ్చెక్కించిందని ఆమె చెప్పారు. శ్రద్ధా దాస్‌ మాట్లాడుతూ ‘‘శుక్రవారం రాత్రి 26 వేల రూపాయల కరెంట్‌ బిల్‌ కట్టాను. ఇది చాలా ఎక్కువ. లాక్‌డౌన్‌ వల్ల మా ఇంటిలో విద్యుత్‌ వాడకం ఏమీ పెరగలేదు. ఇంతకు ముందు ఉన్నట్టే ఉంది. లాస్ట్‌ వీక్‌ బిల్‌ మాత్రమే 8 వేల రూపాయలు కట్టాను. మొత్తంగా నాకు వచ్చిన కరెంట్‌ బిల్‌ రూ. 34 వేలు. పిచ్చి కాకపోతే ఏంటి?’’ అని షాకయ్యారు.


అదానీ ఎలక్ట్రిసిటీ పవర్‌ను వినియోగిస్తున్నారామె. బిల్‌ ఎక్కువ రావడంతో అదానీ కంపెనీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు... టాటా పవర్‌ కంపెనీకి మారిపోవాలనుకుంటున్నట్టు శ్రద్ధా తెలిపారు. కొన్ని రోజుల క్రితం కథానాయిక స్నేహ భర్త, నటుడు ప్రసన్న సైతం కరెంట్‌ బిల్‌ ఎక్కువ వచ్చిందని ట్వీట్‌ చేశారు. సామాన్యులలో చాలామంది లాక్‌డౌన్‌ కాలంలో విద్యుత్‌ వినియోగం పెరగకపోయినా... తమకు కరెంట్‌ బిల్‌ ఎక్కువ వచ్చిందని వాపోయిన ఘటనలు ఉన్నాయి.


Updated Date - 2020-06-28T05:30:00+05:30 IST