సచివాలయ సిబ్బందికి షోకాజ్‌ నోటీసులు

ABN , First Publish Date - 2021-04-17T04:50:35+05:30 IST

మండలంలోని సచివాలయాల విధులకు గైర్హాజరైన సచివాలయ సిబ్బందికి షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు ఎంపీడీవో మోహన్‌కుమార్‌ తెలిపారు.

సచివాలయ సిబ్బందికి షోకాజ్‌ నోటీసులు



ఆత్మకూరురూరల్‌, ఏప్రిల్‌ 16:
మండలంలోని   సచివాలయాల విధులకు గైర్హాజరైన సచివాలయ సిబ్బందికి షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు ఎంపీడీవో మోహన్‌కుమార్‌ తెలిపారు. శుక్రవారం మండలంలోని నల్లకాలువ, బాపనంతాపురం, కరివేన గ్రామాల సచివాలయాలను ఎంపీడీవో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.  నల్లకాలువ గ్రామంలో 4గురు, బాపనంతాపురంలో 3, కరివేన గ్రామంలో మరో నలుగురు సచివాయ ఉద్యోగులు విధులకు గైర్హాజరు అవడంతో వారికి షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు ఎంపీడీవో వెల్లడించారు.


Updated Date - 2021-04-17T04:50:35+05:30 IST