SC: కొవిడ్ మృతులకు ₹50,000 ఇవ్వాల్సిందే

ABN , First Publish Date - 2021-10-04T21:24:21+05:30 IST

కొవిడ్-19తో మరణించిన కుటుంబాలకు పరిహారం తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రతిపాదించిన 50,000 రూపాయలను చెల్లించాల్సిందేనని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది..

SC: కొవిడ్ మృతులకు ₹50,000 ఇవ్వాల్సిందే

న్యూఢిల్లీ: కొవిడ్-19తో మరణించిన కుటుంబాలకు పరిహారం తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రతిపాదించిన 50,000 రూపాయలను చెల్లించాల్సిందేనని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. కొవిడ్-19తో చనిపోయినట్లు ధ్రువీకరణ పత్రం ఉన్నా లేకపోయినా ధరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లోగా పరిహారం మాత్రం అందించాల్సిందేనని, ఏ రాష్ట్రం కూడా దీనిని నిరాకరించరాదని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. అయితే కొందరి మరణ ధ్రువీకరణ పత్రాల్లో కొవిడ్-19తో చనిపోలేదని పేర్కొనడం వంటి కారణాలను సాకుగా చూపి తప్పించుకోరాదని సుప్రీం హెచ్చరించింది. మరణ ధ్రువీకరణ పత్రం అప్పటికే జారీ అయితే మార్పుల కోసం బాధితులు సంబంధిత విభాగం వద్దకు వెళ్లొచ్చని పేర్కొంది. ఈ పథకానికి సంబంధించి మీడియా ఇతర వేదికల్లో విస్తృత ప్రచారం కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

Updated Date - 2021-10-04T21:24:21+05:30 IST