తెలంగాణకు రావాలంటే కల్వకుంట్ల కుటుంబం పర్మిషన్‌ తీసుకోవాలా?: కిషన్ రెడ్డి

ABN , First Publish Date - 2022-05-15T01:14:04+05:30 IST

తెలంగాణకు రావాలంటే కల్వకుంట్ల కుటుంబం పర్మిషన్‌ తీసుకోవాలా?: కిషన్ రెడ్డి

తెలంగాణకు రావాలంటే కల్వకుంట్ల కుటుంబం పర్మిషన్‌ తీసుకోవాలా?: కిషన్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. తెలంగాణకు రావాలంటే ఆయన కుటుంబం అనుమతి తీసుకోవాలా అని ప్రశ్నించారు. తుక్కుగూడ బీజేపీ బహిరంగ సభలో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని ఎందుకు తెరవలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన కిషన్ రెడ్డి.. టీఆర్ఎస్‌ను దళితులు నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. 


అంతకు ముందు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ KCRపై విమర్శలు గుప్పించారు. రైతులను మోసం చేసిన దౌర్భాగ్యాపు సీఎం కేసీఆర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలులో చేతులెత్తేసి కేంద్రంపై నిందలేస్తున్నారని మండిపడ్డారు. అన్ని వర్గాల్లో కేసీఆర్‌పై వ్యతిరేకత ఉందని, హుజురాబాద్ తీర్పు తెలంగాణ అంతటా రిపీట్ అవుతుందని జోస్యం చెప్పారు. తెలంగాణ కేసీఆర్ కబంధ హస్తాల్లో చిక్కుకుందని ఈటల  ఆరోపించారు.

Read more