ప్రణాళికాబద్ధంగా చదవాలి

ABN , First Publish Date - 2022-05-24T05:24:07+05:30 IST

పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రణాళికాబద్ధంగా చదివి లక్ష్యాన్ని సాధించాలని అదనపు కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి అన్నారు. ఎ

ప్రణాళికాబద్ధంగా చదవాలి
మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి

- అదనపు కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి

కాగజ్‌నగర్‌, మే 23: పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత  సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రణాళికాబద్ధంగా చదివి లక్ష్యాన్ని సాధించాలని అదనపు కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే కోనప్ప ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీసు శిక్షణ శిబిరాన్ని సోమ వా రం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రాష్ట్ర ప్రభు త్వం వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు ఇచ్చిందన్నారు. యువత దీన్ని సద్వినియోగం చేసుకుని ఉద్యోగం సాధించేందుకు కష్టపడి చదవాలని సూచించారు. ఎమ్మెల్యే కోనప్ప మాట్లాడుతూ పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులందరికీ అన్ని వస తులు కల్పిస్తున్నామన్నారు. నిపుణులైన శిక్షకులతో కోచింగ్‌ ఇస్తున్నా మని చెప్పారు. తప్పకుండా నమూనా పరీక్షలు రాయాలన్నారు. వీటి లో సాధించిన మార్కులను సరి చూసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. సమావేశంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కాసం శ్రీనివాస్‌, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ రాచకొండ గిరిష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-24T05:24:07+05:30 IST