సాధ్యమైనంత త్వరగా పూర్తవ్వాలి

ABN , First Publish Date - 2022-05-23T05:21:29+05:30 IST

మినీట్యాంక్‌బండ్‌లో చేపడుతున్న ఐలాండ్‌, సస్పెన్షన్‌ బ్రిడ్జి పనులను ఆదివారం కలెక్టర్‌ ఎస్‌ వెంకట్రావు పరిశీలిం చారు.

సాధ్యమైనంత త్వరగా పూర్తవ్వాలి
ట్యాంక్‌బండ్‌ పనులపై చర్చిస్తున్న కలెక్టర్‌

- మినీ ట్యాంక్‌బండ్‌ పనులను పరిశీలించిన కలెక్టర్‌

మహబూబ్‌నగర్‌, మే 22 : మినీట్యాంక్‌బండ్‌లో చేపడుతున్న ఐలాండ్‌, సస్పెన్షన్‌ బ్రిడ్జి పనులను ఆదివారం కలెక్టర్‌ ఎస్‌ వెంకట్రావు పరిశీలిం చారు. ఈ పనులను త్వరితగతిన చేపట్టేందుకు చర్యలు తీసుకోవాల న్నారు. వర్షాకాలం రానున్న నేపథ్యంలో ఈలోపు సాధ్యమైనంత త్వరగా పనులు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ట్యాంక్‌బండ్‌ పనులతో పాటు శిల్పారామం పనులను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్నందున ఏమా త్రం ఆలస్యం కాకుండా యుద్దప్రాతి పదికన పనులు పూర్తిచేయాలని, ఇంకా అవసరమైతే మిషనరీని పెంచుకోవాలని ఇరిగేషన్‌ అధికారులకు సూచాంచారు. వర్షాలు మొదలైతే పనులకు ఆటంకం కలిగి, తీవ్ర జాప్యం జరగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్‌ డీఓ మనోహర్‌, డీఎస్పీ మహేశ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-23T05:21:29+05:30 IST