Tokyo Olympics: నిరాశపరచిన భారత షూటర్లు.. వెనుదిరిగిన మను- సౌరభ్ జంట!
ABN , First Publish Date - 2021-07-27T14:18:07+05:30 IST
టోక్యో ఒలింపిక్స్ ఐదవరోజు భారత షూటర్లు మను భాకర్, సౌరభ్ చౌదరి జంట...
టోక్యో: టోక్యో ఒలింపిక్స్ ఐదవరోజు భారత షూటర్లు మను భాకర్, సౌరభ్ చౌదరి జంట తొలుత అద్భుతమైన ప్రదర్శన చూపారు. ఈ యువ జంట 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిస్డ్ టీమ్ క్వాలిఫికేషన్ రెండవ స్టేజ్కు చేరుకున్నారు. అయితే ఇక్కడ తమ సత్తా చాటలేకపోయారు. దీంతో మెడల్ రౌండ్ నుంచి వెనుదిరిగారు. సౌరభ్ మొదటి రౌండ్లో 296, మను 286 స్కోరు సాధించారు.
దీంతో టాప్-8 టీముల క్వాలిఫికేషన్లోని రెండవ స్టేజ్కు చేరుకున్నారు. ప్రతీ షూటర్కు రెండు సిరీస్లలో 10 షాట్లు వినియోగించేందుకు అవకాశం కల్పిస్తారు. టాప్-2 టీమ్ గోల్డ్ మెడల్ మ్యాచ్ కోసం క్వాలిఫై అవుతుంది. అయితే మూడవ, నాల్గవ నంబర్లకు చేరుకున్న టీమ్ కాంస్య పతకం మ్యాచ్ ఆడుతుంది. మొదటి రౌండ్లో టాప్లో ఉన్న మను, సౌరభ్ జంట రెండవ రౌండ్లో 7వ నంబర్కు చేరుకుంది. మెడల్ రౌండ్కు కేవలం నాలుగు టీమ్లే క్వాలిఫై అవుతాయి.