నగర శివార్లలో కాల్పుల కలకలం!
ABN , First Publish Date - 2022-08-16T09:47:49+05:30 IST
రాజధాని హైదరాబాద్ నగర శివార్లలోని టీఆర్ఎస్ నేత ఫాంహౌజ్లో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది.
బర్త్డే వేడుకల్లో టీఆర్ఎస్ నేతల హల్చల్
వాట్సప్ స్టేట్సలో పెట్టడంతో వీడియో వైరల్
నెల తరువాత వెలుగులోకి ఘటన
యాచారం/కందుకూరు, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): రాజధాని హైదరాబాద్ నగర శివార్లలోని టీఆర్ఎస్ నేత ఫాంహౌజ్లో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. నెలరోజుల క్రితం జరిపిన ఈ కాల్పుల తాలూకూ వీడియోను వారు వాట్సా్పలో స్టేట స్గా పెట్టడంతో.. ఆ వీడియో వైరల్ అయ్యి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా యాచారం మం డల కందుకూరు మం డలం దెబ్బడగూడ గ్రామానికి చెందిన జిట్ట రవీందర్రెడ్డికి యాచారం మండలం నజ్దిక్ సింగారంలో ఫాంహౌజ్ ఉంది. జూలై 14 రాత్రి ఈ ఫామ్హౌజ్లో జరిగిన పుట్టినరోజు వేడుకకు.. కందుకూరు మండలం టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు కొలన్ విఘ్నేశ్వర్రెడ్డి, టీఆర్ఎ్సకే చెందిన మరో నేత విక్రమ్రెడ్డితోపాటు మరో 15మంది యువకులు హాజరయ్యారు. అక్కడ.. విఘ్నేశ్వర్రెడ్డి, విక్రమ్రెడ్డి తుపాకీతో కాల్పులు జరిపారు. ఆ వీడియోను వాట్సాప్ స్టేటస్ లో సోమవారం పెట్టుకున్నారు. దాన్ని చూసిన స్థానికులు.. విషయాన్ని మీడియాకు, పోలీసులకు చేరవేశారు. పోలీసులు ఆ ఫాంహౌజ్కు వెళ్లి దర్యాప్తు జరిపి కాల్పులు నిజమేనని నిర్ధారించుకున్నారు. వారి నుంచి లైసెన్స్ ఉన్న ఎయిర్గన్ మోడల్-35తో పాటు పెల్లె ట్లు స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్గన్లోని పెల్లెట్స్ తగిలితే గాయపడే అవకాశాలుంటాయని.. పోలీసులు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు