నగర శివార్లలో కాల్పుల కలకలం!

ABN , First Publish Date - 2022-08-16T09:47:49+05:30 IST

రాజధాని హైదరాబాద్‌ నగర శివార్లలోని టీఆర్‌ఎస్‌ నేత ఫాంహౌజ్‌లో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది.

నగర శివార్లలో కాల్పుల కలకలం!

బర్త్‌డే వేడుకల్లో టీఆర్‌ఎస్‌ నేతల హల్‌చల్‌

వాట్సప్‌ స్టేట్‌సలో పెట్టడంతో వీడియో వైరల్‌

నెల తరువాత వెలుగులోకి ఘటన


యాచారం/కందుకూరు, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): రాజధాని హైదరాబాద్‌ నగర శివార్లలోని టీఆర్‌ఎస్‌ నేత ఫాంహౌజ్‌లో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. నెలరోజుల క్రితం జరిపిన ఈ కాల్పుల తాలూకూ వీడియోను వారు వాట్సా్‌పలో స్టేట స్‌గా పెట్టడంతో.. ఆ వీడియో వైరల్‌ అయ్యి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా యాచారం మం డల కందుకూరు మం డలం దెబ్బడగూడ గ్రామానికి చెందిన జిట్ట రవీందర్‌రెడ్డికి యాచారం మండలం నజ్దిక్‌ సింగారంలో ఫాంహౌజ్‌ ఉంది. జూలై 14 రాత్రి ఈ ఫామ్‌హౌజ్‌లో జరిగిన పుట్టినరోజు వేడుకకు.. కందుకూరు మండలం టీఆర్‌ఎస్‌ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు కొలన్‌ విఘ్నేశ్వర్‌రెడ్డి, టీఆర్‌ఎ్‌సకే చెందిన మరో నేత విక్రమ్‌రెడ్డితోపాటు మరో 15మంది యువకులు హాజరయ్యారు. అక్కడ.. విఘ్నేశ్వర్‌రెడ్డి, విక్రమ్‌రెడ్డి తుపాకీతో కాల్పులు జరిపారు. ఆ వీడియోను వాట్సాప్‌ స్టేటస్‌ లో సోమవారం పెట్టుకున్నారు. దాన్ని చూసిన స్థానికులు.. విషయాన్ని మీడియాకు, పోలీసులకు చేరవేశారు. పోలీసులు ఆ ఫాంహౌజ్‌కు వెళ్లి దర్యాప్తు జరిపి కాల్పులు నిజమేనని నిర్ధారించుకున్నారు. వారి నుంచి లైసెన్స్‌ ఉన్న ఎయిర్‌గన్‌ మోడల్‌-35తో పాటు పెల్లె ట్లు స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్‌గన్‌లోని పెల్లెట్స్‌ తగిలితే గాయపడే అవకాశాలుంటాయని.. పోలీసులు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు

Updated Date - 2022-08-16T09:47:49+05:30 IST