Tokyo Paralympics: పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో సింగ్‌రాజ్‌కు కాంస్యం!

ABN , First Publish Date - 2021-08-31T17:35:14+05:30 IST

టోక్యో పారా ఒలింపిక్స్‌లో పురుషుల 10 మీటర్ల...

Tokyo Paralympics: పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో సింగ్‌రాజ్‌కు కాంస్యం!

టోక్యో: టోక్యో పారా ఒలింపిక్స్‌లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌ విభాగంలో భారత్‌కు చెందిన సింగ్‌రాజ్ కాంస్య పతకం దక్కించుకున్నారు. టైటిల్ మ్యాచ్‌లో మనీష్ నర్వాల్ నిరాశపరిచారు. రెండవ రౌండ్‌లో నిష్క్రమించారు. 


అంతకుముందు మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారతదేశానికి చెందిన రుబీనా ఫ్రాన్సిస్ తుది రేసు నుంచి నిష్క్రమించారు. ఫైనల్లో 128.5 పాయింట్లతో ఆమె ఏడో స్థానంలో నిలిచారు. కాగా ఆర్చర్ రాకేశ్ కుమార్ పురుషుల వ్యక్తిగత ఈవెంట్ క్వార్టర్ ఫైనల్లో ఓటమిపాలయ్యారు. వ్యక్తిగత కాంపౌండ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో రాకేష్ కుమార్‌ను చైనాకు చెందిన జిన్‌లియాంగ్ 145-143 తేడాతో ఓడించారు.

Updated Date - 2021-08-31T17:35:14+05:30 IST