కోర్టులో ఏకంగా న్యాయమూర్తి పర్సునే కొట్టేసిన దొంగలు.. చివరకు..

ABN , First Publish Date - 2022-04-20T08:25:09+05:30 IST

ఒక దొంగ ఏకంగా కోర్టులోనే చేతి వాటం ప్రదర్శించాడు.. ఏకంగా జడ్జి పర్సునే కొట్టేశాడు.. విషయం తెలుసుకున్న కోర్టు, పోలీసు సిబ్బందికి మైండ్ బ్లాక్ అయింది.. నిందితుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఇటావాలోని సివిల్‌లైన్ ప్రాంతంలో...

కోర్టులో ఏకంగా న్యాయమూర్తి పర్సునే కొట్టేసిన దొంగలు.. చివరకు..

ఒక దొంగ ఏకంగా కోర్టులోనే చేతి వాటం ప్రదర్శించాడు.. ఏకంగా జడ్జి పర్సునే కొట్టేశాడు.. విషయం తెలుసుకున్న కోర్టు, పోలీసు సిబ్బందికి మైండ్ బ్లాక్ అయింది.. నిందితుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఇటావాలోని సివిల్‌లైన్ ప్రాంతంలో ఉన్న జిల్లా కోర్టు కాంప్లెక్స్‌లో ఈ ఘటన జరిగింది. 


జిల్లా కోర్టు కాంప్లెక్స్‌లో న్యాయమూర్తి కల్పనా సింగ్ ఎటావా తన ఛాంబర్‌లో వివిధ కేసులను విచారిస్తున్నారు. ఆ సమయంలో పెద్ద సంఖ్యలో న్యాయవాదులు, ఇతర వ్యక్తులు ఆమె ఛాంబర్‌లోకి ప్రవేశించారు. కేసుల విచారణ పూర్తయిన తర్వాత న్యాయమూర్తి తన పర్సు ఓపెన్ చేసి చూడగా అందులో ఉండాల్సిన రూ.15 వేలు కనిపించలేదు. 


చోరీ గురించి తెలుసుకున్న సివిల్ లైన్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడి కోసం అన్వేషణ సాగిస్తున్నారు. కోర్టు లోపలే ఈ దొంగతనం జరగడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.  

Updated Date - 2022-04-20T08:25:09+05:30 IST