మీ వోడు తెలుగు మాట్లాడితే షాకింగ్‌ న్యూస్‌..!

ABN , First Publish Date - 2022-05-29T07:52:50+05:30 IST

మీ వోడు తెలుగు మాట్లాడితే షాకింగ్‌ న్యూస్‌..!

మీ వోడు తెలుగు మాట్లాడితే షాకింగ్‌ న్యూస్‌..!

అమరావతి/ఒంగోలు, మే 28 (ఆంధ్రజ్యోతి): ‘‘మాకో ముక్కోడు తగిలిండు.. మీకో తిక్కోడు తగిలిండు. మావోడు కనిపిస్తే బ్రేకింగ్‌ న్యూస్‌.. మీవోడు తెలుగు మాట్లాడితే షాకింగ్‌ న్యూస్‌. మావోడు గడీలో ఉంటడు.. మీవోడు ప్యాలె్‌సలో ఉంటడు. మావోడు పెగ్గులేస్తే.. మీవోడు రంగులేస్తాడు. తెలంగాణకు సెక్రటేరియట్‌ లేదు.. ఆంధ్రకు రాజధాని లేదు’’ అంటూ కేసీఆర్‌, జగన్‌ను ఉద్దేశించి తెలంగాణ టీడీపీ నేత నన్నూరి నర్సిరెడ్డి వ్యాఖ్యానించారు. ఒంగోలు మహానాడులో ప్రాసలతో కూడిన తెలంగాణ యాసలో మాట్లాడి సభికుల్ని ఉత్సాహ పరిచారు. తెలంగాణలో దొరల పాలన ఉంటే, ఏపీలో దొంగల పాలన ఉందని  విమర్శించారు. తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగం, ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం ఉందన్నారు. రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాక తెలంగాణలో అధికార తిట్టు ‘సన్నాసి’ అయితే, ఏపీలో ‘నీయమ్మ మొగుడు’ అయిందన్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ కోతలతో కొత్త దంపతుల శోభనం కష్టాల కథను చెప్పారు. తెలుగుదేశం జెండాను ప్రతి ఒక్కరూ బలపరచాల్సిన అవసరం ఉందన్నారు.

Updated Date - 2022-05-29T07:52:50+05:30 IST