వివాహం తర్వాత మొదటి రాత్రి మనసు విప్పి మాట్లాడిన భార్య.. ఆమె చెప్పింది విని షాకై విడాకులు అడిగిన భర్త..

ABN , First Publish Date - 2022-04-07T17:31:23+05:30 IST

వారిద్దరికీ మూడేళ్ల క్రితం వివాహం జరిగింది.. తొలి రేయి దంపతులిద్దరూ మనసు విప్పి మాట్లాడుకున్నారు..

వివాహం తర్వాత మొదటి రాత్రి మనసు విప్పి మాట్లాడిన భార్య.. ఆమె చెప్పింది విని షాకై విడాకులు అడిగిన భర్త..

వారిద్దరికీ మూడేళ్ల క్రితం వివాహం జరిగింది.. తొలి రేయి దంపతులిద్దరూ మనసు విప్పి మాట్లాడుకున్నారు.. భర్త తనకు సంబంధించిన విషయాలన్నీ చెప్పాడు.. దీంతో భార్య కూడా నిజాయితీగా కొన్ని విషయాలు చెప్పింది.. వివాహానికి ముందు తనపై అత్యాచారం జరిగినట్టు చెప్పింది.. అంత పెద్ద విషయం తన దగ్గర దాచి పెళ్లి చేసుకున్నందుకు భర్త తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.. భార్యను పుట్టింట్లో వదిలేసి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. 


మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో నివసిస్తున్న 25 ఏళ్ల యువకుడికి 2019లో 21 ఏళ్ల యువతితో వివాహం జరిగింది. హనీమూన్‌ సమయంలో దంపతులిద్దరూ మాట్లాడుకున్నారు. భర్త తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను భార్యతో పంచుకున్నాడు. దీంతో భార్య కూడా భర్తకు షాకింగ్ విషయం చెప్పింది. పెళ్లికి ముందు తనపై జరిగిన అత్యాచారం గురించి చెప్పింది. అంత పెద్ద విషయాన్ని తన దగ్గర దాచి మోసం చేసి పెళ్లి చేసుకున్నందుకు వరుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. తర్వాతి రోజు ఉదయమే భార్యను పుట్టింట్లో వదిలేసి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు.  


తనకు జరిగిన వివాహాన్ని రద్దు చేయాలని ఆ వ్యక్తి 2019లో గ్వాలియర్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసును విచారించిన కుటుంబ న్యాయస్థానం యువకుడి భార్యకు నోటీసు జారీ చేసింది. స్పందించేందుకు తగినంత సమయం ఇచ్చింది. కానీ ఆమె కోర్టు ముందు హాజరు కాలేదు. మూడేళ్లలో ఒక్కసారి కూడా ఆమె కోర్టుకు రాలేదు. దీంతో భర్త వాదన మేరకు వివాహాన్ని రద్దు చేస్తూ కోర్టు తీర్పునిచ్చింది.

Updated Date - 2022-04-07T17:31:23+05:30 IST