తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు భారీ షాక్

ABN , First Publish Date - 2021-03-06T01:31:19+05:30 IST

తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు భారీ షాకిచ్చారు. 2015, 2017లో ఇచ్చిన పదోన్నతులను విద్యుత్ సంస్థలు రద్దు చేయనున్నాయి

తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు భారీ షాక్

హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు భారీ షాకిచ్చారు. 2015, 2017లో ఇచ్చిన పదోన్నతులను విద్యుత్ సంస్థలు రద్దు చేయనున్నాయి. ఇప్పటికే జెన్‌కోలో 8 మంది చీఫ్ ఇంజనీర్స్‌కు ఎస్ఈలుగా రివర్షన్ ఇచ్చారు. పాత తేదీతో జెన్‌కో యాజమాన్యం ఉత్తర్వులు ఇచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత పదోన్నతులు పొందిన ఇతరులకు సైతం డిమోషన్ ఇచ్చారు. దాదాపు 1,150 మంది ఇంజినీర్లు, అధికారులకు రివెర్షన్లు ఇస్తూ ధర్మాధికారి కమిటీ తుది నివేదిక ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల అమలుకు విద్యుత్ యాజమాన్యాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఏపీ నుంచి వచ్చిన ఉద్యోగులు, స్థానిక ఉద్యోగులతో కొత్త సీనియారిటీ జాబితాలు తయారు చేసి మళ్లీ పదోన్నతులు ఇస్తారు. ఏపీ నుంచి సీనియర్ అధికారులు అధిక సంఖ్యలో రావడంతో ఉన్నత పదవులు వారికే దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు.

Updated Date - 2021-03-06T01:31:19+05:30 IST