ఫలితాలొచ్చిన ఐదు రోజులకే కమల్‌కు షాక్..

ABN , First Publish Date - 2021-05-07T18:56:06+05:30 IST

ఫలితాలొచ్చిన ఐదు రోజులకే కమల్‌కు షాక్..

ఫలితాలొచ్చిన ఐదు రోజులకే కమల్‌కు షాక్..

  • ఎంఎన్‌ఎంకు మహేంద్రన్‌ గుడ్‌బై


హైదరాబాద్/అడయార్‌ : ముగిసిన శాసనసభ ఎన్నికల్లో నటుడు కమల్‌హాసన్‌ సారథ్యంలోని మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) ఉపాధ్యక్షుడుగా ఉన్న మహేంద్రన్‌ పార్టీ నుంచి వైదొలిగారు. ఈ మేరకు ఆయన గురువారం ప్రకటన విడుదల చేశారు. మక్కల్‌ నీది మయ్యంలో ప్రజాస్వామ్యం లేదని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. అంతేకాకుండా పార్టీ అధ్యక్షుడు కమల్‌ హాసన్‌ పద్దతి మార్చుకోవాలని, కానీ, ఆయనలో మార్పువస్తుందని తాను భావించడం లేదని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. ఈ రాజీనామాల పర్వంపై కమల్ స్పందిస్తూ మహేంద్రన్‌ ‘ద్రోహి’ అని విమర్శలు గుప్పించారు. అంతేకాదు.. ఒకవేళ ఆయన (మహేంద్రన్‌) రాజీనామా చేయకపోయినా తామే పార్టీ నుంచి తొలగించేవారమని కమల్ చెప్పుకొచ్చారు.

Updated Date - 2021-05-07T18:56:06+05:30 IST