విద్యుదాఘాతంతో యువకుడి మృతి

ABN , First Publish Date - 2020-12-05T05:44:38+05:30 IST

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

మేడ్చల్‌: విద్యుదాఘాతంతో  యువకుడు మృతిచెందిన సంఘటన మండలంలోని రాయిలాపూర్‌ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మహేందర్‌(25) గురువారం సాయంత్రం గ్రామ పరిధిలోని అప్పలయ్య చెరువులో చేపలను పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుత్‌షాక్‌కు గురై మృతిచెందాడు. శుక్రవారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలం వద్దకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-12-05T05:44:38+05:30 IST