టీటీడీ ఆస్థాన సంగీత విద్వాన్గా శోభారాజు
ABN , First Publish Date - 2020-10-01T09:10:41+05:30 IST
టీటీడీ ఆస్థాన సంగీత విద్వాన్గా ప్రముఖ గాయని శోభారాజును నియమిస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమెకు టీటీడీ నుంచీ నియామకపు ఉత్తర్వులు అందాల్సి ఉంది...
తిరుపతి, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): టీటీడీ ఆస్థాన సంగీత విద్వాన్గా ప్రముఖ గాయని శోభారాజును నియమిస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమెకు టీటీడీ నుంచీ నియామకపు ఉత్తర్వులు అందాల్సి ఉంది. అవి అందిన నాటి నుంచి ఈ పదవిలో ఆమె రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. శ్రీవారి దయతోనే తనకు టీటీడీలో ఆస్థాన సంగీత విద్వాన్గా అవకాశం దక్కిందని శోభారాజు ఆనందం వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి ఆమె ఫోన్లో ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు.