కరోనా వెనుక జిహాదీ వాసన : బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2020-04-05T15:23:44+05:30 IST

కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు దేశ వ్యాప్తంగా ముమ్మర ప్రయత్నాలు జరుగుతుంటే

కరోనా వెనుక జిహాదీ వాసన : బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

బెంగళూరు : కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు దేశ వ్యాప్తంగా ముమ్మర ప్రయత్నాలు జరుగుతుంటే ఢిల్లీ ధార్మిక సదస్సుకు వెళ్ళివచ్చినవారు వైద్య పరీక్షలు జరుపుకోకుండా దాగుడు మూతలు ఆడుతున్న వైనంపై బీజేపీ ఎంపీ శోభాకరంద్లాజే మండిపడ్డారు. చిక్కమగళూరులో శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ కరోనా వెనుక జిహాదీ వాసన వస్తోందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.


ఢిల్లీకి వెళ్ళి కరోనాను అంటించుకొని రాష్ట్రానికి తిరిగివచ్చిన వారు స్వచ్ఛందంగా వైద్యం చేయించుకోక తప్పించుకొని తిరుగుతుండడంతో తమకు ఇలాంటి అనుమానాలు వస్తున్నాయన్నారు. ఆయా జిల్లాల అధికార యంత్రాంగం తక్షణం ఢిల్లీ నుంచి తిరిగివచ్చిన ఇలాంటి వారిని గుర్తించి వైద్య పరీక్షలు జరపడం ద్వారా ఈ వైరస్‌ ఇతరులకు సోకకుండా అడ్డుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2020-04-05T15:23:44+05:30 IST