ఐపీఎల్‌ను వాయిదా వేయాలని ఎప్పుడో చెప్పా: అక్తర్

ABN , First Publish Date - 2021-05-06T15:53:16+05:30 IST

ప్రజల ప్రాణాల కంటే మరేదీ ముఖ్యం కాదని పాకిస్థాన్ మాజీ స్టార్ బౌలర్ షోయబ్ అక్తర్ పేర్కొన్నాడు.

ఐపీఎల్‌ను వాయిదా వేయాలని ఎప్పుడో చెప్పా: అక్తర్

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను వాయిదా వేయాలని రెండు వారాల క్రితమే తాను చెప్పానని, ప్రజల ప్రాణాల కంటే మరేదీ ముఖ్యం కాదని పాకిస్థాన్ మాజీ స్టార్ బౌలర్ షోయబ్ అక్తర్ పేర్కొన్నాడు. పలు ఫ్రాంఛైజీలకు చెందిన ఆటగాళ్లు కూడా కరోనా వైరస్ బారిన పడడంతో ఐపీఎల్‌ను నిరవధికంగా వాయిదా వేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. 


ఈ నిర్ణయంపై అక్తర్ స్పందించాడు. `ఐపీఎల్‌ను వాయిదా వేయాలనే నిర్ణయం సరైనది. ఇలా అవుతుందని నాకు ముందే తెలుసు. ఐపీఎల్‌ను వాయిదా వేయాలని రెండు వారాల క్రితమే సూచించాను. ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో ఉన్న భారత్‌లో మనుషుల ప్రాణాలు కాపాడడం కంటే మరేది ముఖ్యం కాద`ని అక్తర్ అన్నాడు. 

Updated Date - 2021-05-06T15:53:16+05:30 IST