టూరిజం స్పాట్గా శివసాగర్ చెరువు
ABN , First Publish Date - 2021-06-15T05:21:11+05:30 IST
టూరిజం స్పాట్గా శివసాగర్ చెరువు
- వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్
వికారాబాద్: టూరిజం హాట్ స్పాట్గా శివసాగర్ చెరువు మారబోతోందని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ పౌసుమిబసు, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేష్ అధికారులతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని శివారెడ్డిపేట చెరువు సమీపంలో కొత్త హంగులతో పార్క్, మినీ ట్యాంక్బండ్ నిర్మాణ ప్రణాళికపై చర్చించారు. పార్క్నిర్మాణంలో వాటర్ ఫౌంటైన్, టాయ్ ట్రైన్, ఆంపి థియేటర్ మొదలైనవి భాగం చేయాలన్నారు. దీని ద్వారా రానున్న రోజుల్లో మున్సిపాలిటీకి ఆదాయం వచ్చేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. పట్టణ ప్రజలకు, పర్యాటకులకు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ శషాద్ బేగం, కమిషనర్ బుచ్చయ్య, టీయూఎఫ్ఐడీసీ ఏబీ.రమణమూర్తి, పబ్లిక్ హెల్త్ ఈఈ ప్రభాకర్రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.