శివరాత్రి ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహించాలి
ABN , First Publish Date - 2021-03-02T05:06:11+05:30 IST
నిత్యపూజకోనలో జరగబోయే మహాశివరాత్రి ఉత్సవాలు దిగ్విజయంగా జరిగేందుకు అన్ని శాఖల అధికారులు సహకరించాలని, ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని అలాగే విద్యుత్ శాఖ అధి కారులు కూడా విద్యుత్ లోపం తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఈవో సురేష్ కుమార్రెడ్డి తెలిపారు.
సిద్దవటం, మార్చి1 : నిత్యపూజకోనలో జరగబోయే మహాశివరాత్రి ఉత్సవాలు దిగ్విజయంగా జరిగేందుకు అన్ని శాఖల అధికారులు సహకరించాలని, ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని అలాగే విద్యుత్ శాఖ అధి కారులు కూడా విద్యుత్ లోపం తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఈవో సురేష్ కుమార్రెడ్డి తెలిపారు. తహసీల్దారు కార్యాలయంలో సోమవారం శివ రాత్రి మహోత్సవం సందర్భంగా నిత్యపూజకోనలో ఈ నెల 10, 11, 12వ తేదీలలో జరగనున్న మహాశివరాత్రి వేడుకలకు అన్ని శాఖల అధికారులు సహకరించాలన్నారు. తహసీల్దారు రమాకుమారి, ఎంపీడీవో ప్రతాప్, ఒంటిమిట్ట సీఐ హనుమంతునాయక్ , ఫారెస్ట్ రేంజర్ ప్రసాద్, ఆర్టీసీ అధికారులు, ఫైర్ అధికారులు పాల్గొన్నారు.