ముంగేరీ ఘటన హిందుత్వంపై దాడే : శివసేన
ABN , First Publish Date - 2020-10-30T16:39:35+05:30 IST
ముంగేరీ ఘటన కచ్చితంగా హిందుత్వంపై దాడేనని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పేర్కొన్నారు. అదే ఘటన గనక మహారాష్ట్ర, రాజస్థాన్
ముంబై : ముంగేరీ ఘటన కచ్చితంగా హిందుత్వంపై దాడేనని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పేర్కొన్నారు. అదే ఘటన గనక మహారాష్ట్ర, రాజస్థాన్, బెంగాల్ లో జరిగి ఉంటే అక్కడి గవర్నర్లు, బీజేపీ నేతలు రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్లు చేసేవారని చురకలంటించారు. అయితే ముంగేరీ ఘటన బిహార్లోనే జరిగిందని అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్, బీజేపీ నేతలు ఎందుకు డిమాండ్ చేయడం లేదని రౌత్ సూటిగా ప్రశ్నించారు.
బిహార్లోని ముంగేరీ లో మంగళవారం దుర్గాదేవి నిమజ్జనోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున హింస చెలరేగింది. కాల్పుల్లో ఓ వ్యక్తి మరణించగా, పలువురు గాయపడ్డారు. ఎంతకీ అదుపులోకి రాకపోవడంతో పోలీసులు లాఠీఛార్జ్ కూడా చేశారు.