పెనుగొండలో మహా శివరాత్రి ఉత్సవాలు
ABN , First Publish Date - 2021-03-08T04:59:48+05:30 IST
నగరేశ్వర, మహిషాసుర మర్ధని, వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో మహా శివరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి.
పెనుగొండ, మార్చి7: నగరేశ్వర, మహిషాసుర మర్ధని, వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో మహా శివరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధాన అర్చకులు కోట సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం మేలుకొలుపు, నగరేశ్వరస్వామికి అభిషేకాలు, అమ్మవార్లకు కుంకుమ పూజలు చేశారు. అనంతరం నగరేశ్వరస్వామికి పెండ్లి కుమారుడిగా మహిషాసురమర్ధని అమ్మవారిని పెండ్లి కుమార్తెగా అలంకరించారు. అంకురార్పణ, ధ్వజారోహణ, బలిహరణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ ఈవో బీఎస్ఎస్ శ్రీనివాస్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.