వైసీపీ ప్రజా ప్రతినిధులపై శివాజీ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-03-04T22:11:05+05:30 IST

వైసీపీ ప్రజా ప్రతినిధులపై నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 49 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు వేరే పార్టీతో టచ్‌లో ఉన్నారని వెల్లడించారు.

వైసీపీ ప్రజా ప్రతినిధులపై శివాజీ సంచలన వ్యాఖ్యలు

అమరావతి: వైసీపీ ప్రజా ప్రతినిధులపై నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 49 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు వేరే పార్టీతో టచ్‌లో ఉన్నారని వెల్లడించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ హయాంలో మందిర్, మసీదు మాత్రమే తెచ్చారని తప్పుబట్టారు. వ్యాపారస్తులు రాజకీయాలలోకి రావడం వల్లే అమరావతి కి ఈ పరిస్థితి వచ్చిందని తెలిపారు. ప్రత్యేక హోదా గురించి సీఎం జగన్ మాట్లాడిన మాటలు చాలా దారుణమన్నారు. ఎమ్మెల్యేలుగా పనిచేసే వారికే ఈ సారి టిక్కెట్లు ఇవ్వాలని కోరారు. రాష్ట్రానికి అభివృద్ధి టీడీపీ, కాంగ్రెస్ హయాంలో జరిగిందని తెలిపారు. ఓటుకు 50 వేలు ఇచ్చినా వైసీపీ ఈ సారి గెలిచే  పరిస్థితి లేదని శివాజీ జోస్యం చెప్పారు. కేంద్రానికి మెజార్టీ ఉంది కదా అని హక్కులను వదిలేస్తారా? అని ప్రశ్నించారు. ఈ రోజుల్లో కూడా కులం గురించి ఎందుకు మాట్లాడుతున్నారని శివాజీ నిలదీశారు. 

Updated Date - 2022-03-04T22:11:05+05:30 IST