జగన్ ప్రజావ్యతిరేక నిర్ణయాలను విద్యార్థులు ప్రశ్నించాలి: శివాజీ
ABN , First Publish Date - 2021-12-17T22:15:46+05:30 IST
ఏపీ అభివృద్ధి పట్ల ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా ఉందని నటుడు శివాజీ అన్నారు.
తిరుపతి: ఏపీ అభివృద్ధి పట్ల వైసీపీ ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా ఉందని నటుడు శివాజీ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ ప్రజావ్యతిరేక నిర్ణయాలను విద్యార్థులు ప్రశ్నించాలన్నారు. మీ భవిష్యత్తును తొక్కేస్తున్న వ్యక్తి గురించి మాట్లాడరా? అని ప్రశ్నించారు. సీఎం జగన్ ఎన్నో తప్పులు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ చేసిన తప్పులు ఇప్పటికే వంద దాటాయని శివాజీ చెప్పారు.