దసరా ర్యాలీ క్యాన్సిల్!
ABN , First Publish Date - 2020-10-25T12:10:49+05:30 IST
మహానగరం ముంబైలో దసరా సందర్భంగా శివసేన ప్రతీయేటా దసరా ర్యాలీ నిర్వహిస్తూ...
ముంబై: మహానగరం ముంబైలో దసరా సందర్భంగా శివసేన ప్రతీయేటా దసరా ర్యాలీ నిర్వహిస్తూ వస్తోంది. పార్టీ తరపున దసరా నాడు శివాజీ పార్కు మైదానంలో సంప్రదాయ ఉత్సవాలు జరుగుతుండేవి. అయితే ఈసారి కరోనా కారణంగా దసరా ర్యాలీని నిర్వహించడం లేదని పార్టీ ప్రకటించింది. శివాజీ పార్కులో ఉత్సవాలు జరగకపోవడం ఇది తొలిసారి.
ప్రస్తుతం మహారాష్ట్ర సర్కారు కరోనా ప్రోటోకాల్ను కఠినంగా అమలు చేస్తున్నందున భారీ ఎత్తున దసరా ఉత్సవాలు నిర్వహించకూడదని నిర్ణయించుకుంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ముంబైలోని దాదర్లోగల శివాజీ పార్కు మైదానంలోని సావర్కర్ ఆడిటోరియంలో ఈరోజు సాయంత్రం 7 గంటలకు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అలాగే సీఎం కుటుంబ సభ్యులతో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలు సావర్కర్ కు నివాళులు అర్పించనున్నారు. అయితే ఈ కార్యక్రమంలో 50 మంది మాత్రమే పాల్గొనేందుకు అనుమతినివ్వనున్నారు.