కాణిపాకం ఆరులైన్ల రోడ్డు వద్ద శిల్పారామం
ABN , First Publish Date - 2022-05-27T06:46:12+05:30 IST
కాణిపాకానికి సమీపంలోని ఆరులైన్ల రహదారిపై శిల్పారామం ఏర్పాటు చేయనున్నట్లు తిరుపతి పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ మురళీకృష్ణ తెలిపారు.
ఐరాల(కాణిపాకం), మే 26: కాణిపాకానికి సమీపంలోని ఆరులైన్ల రహదారిపై శిల్పారామం ఏర్పాటు చేయనున్నట్లు తిరుపతి పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ మురళీకృష్ణ తెలిపారు. గురువారం ఆయన కాణిపాకం వరసిద్ధుడిని దర్శించుకున్నారు. దర్శనానంతరం విలేకరులతో మాట్లాడుతూ కాణిపాక క్షేత్రం అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని పర్యాటక శాఖ ఆధ్వర్యంలో స్థానికంగా అతిథి గృహాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. కాణిపాకం పరిసరాలలో బోటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇందుకోసం మణికంఠేశ్వర స్వామి ఆలయ సమీపంలో ఉన్న పిళ్లారి చెరువును పరిశీలించారు. ఆలయ చైర్మన్ మోహన్రెడ్డి, శిల్పారామం పరిపాలన అధికారి ఖాదర్వలి, ఈఈ వెంకటనారాయణ పాల్గొన్నారు.