శిల్పాచౌదరి కేసు... తెరపైకి రెండు పేర్లు
ABN , First Publish Date - 2021-12-06T21:52:16+05:30 IST
అధిక వడ్డీ ఇప్పిస్తానంటూ కొంతమంది టాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు పలువురు వ్యాపారులను బురిడీ కొట్టించిన శిల్పా చౌదరి కేసులో రోజుకొక కొత్త కోణం వెలుగు చూస్తోంది.
హైదరాబాద్: అధిక వడ్డీ ఇప్పిస్తానంటూ కొంతమంది టాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు పలువురు వ్యాపారులను బురిడీ కొట్టించిన శిల్పా చౌదరి కేసులో రోజుకొక కొత్త కోణం వెలుగు చూస్తోంది. శిల్పాచౌదరి కేసుపై నార్సింగ్ పోలీసులు విచారించారు. శిల్పా కేసులో వెలుగులోకి మరో రెండు పేర్లు చేరాయి. షామీర్పేట్ చంద్ర మల్లారెడ్డితో పాటు ప్రతాప్రెడ్డి పేర్లను పోలీసుల విచారణలో శిల్పా వెల్లడించినట్టు సమాచారం. మల్లారెడ్డి, ప్రతాప్రెడ్డికి డబ్బులు ఇచ్చానని పోలీసులకు శిల్పా చెప్పినట్లు తెలిసింది. శిల్పాచౌదరిని మరోసారి కస్టడీలోకి పోలీసులు తీసుకోనున్నారు. శిల్ప చౌదరి దాదాపు రెండువందల కోట్ల దాకా మోసం చేసినట్లు తెలుస్తోంది. దివ్యరెడ్డి అనే మహిళ ఫిర్యాదుతో శిల్ప చౌదరిపై కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగారు. శిల్పను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.