Hyderabad: శిల్పాచౌదరీ కస్టడీ వేగవంతం
ABN , First Publish Date - 2021-12-12T17:46:25+05:30 IST
కిట్టి పార్టీల పేరుతో అధిక వడ్డీలు ఆశ చూపి మోసం చేసి అరెస్ట్ అయిన శిల్పాచౌదరీ కస్టడీని నార్సింగి పోలీసులు వేగవంతం చేశారు.
హైదరాబాద్: కిట్టి పార్టీల పేరుతో అధిక వడ్డీలు ఆశ చూపి మోసం చేసి అరెస్ట్ అయిన శిల్పాచౌదరీ కస్టడీని నార్సింగి పోలీసులు వేగవంతం చేశారు. శిల్పాచౌదరికి బ్లాక్ మనీని వైట్గా మార్చడానికి ఇచ్చిన వ్యక్తులకు నోటీసులు జారీ చేశారు. 90 కోట్ల రూపాయలు శిల్పాకి విదేశాలో పెట్టుబడుల కోసం ఇచ్చిన వారందరికీ ఇప్పటికే నోటీసులు అందినట్టు సమాచారం. ఎవరెవరు ఇచ్చారు?... ఒక్కొక్కరు ఎంత డబ్బు ఇచ్చారు? అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.