శిల్పా చౌదరిపై ఫిర్యాదు చేసిన ఓ హీరో భార్య
ABN , First Publish Date - 2021-12-01T23:20:38+05:30 IST
శిల్పా చౌదరిపై ఓ హీరో భార్య ఫిర్యాదు చేశారు. రూ.2.9 కోట్లు ఎగ్గొట్టారంటూ నార్సింగ్ పీఎస్లో ఆమె ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్: శిల్పా చౌదరిపై ఓ హీరో భార్య ఫిర్యాదు చేశారు. రూ.2.9 కోట్లు ఎగ్గొట్టారంటూ నార్సింగ్ పీఎస్లో ఆమె ఫిర్యాదు చేశారు. కిట్టి పార్టీలో శిల్ప తనకు పరిచయమైందని పేర్కొన్న ఆమె పేర్కొన్నారు. మహిళాల నుంచి శిల్పా చౌదరి భారీగా డబ్బులు వసూలు చేసింది. డబ్బుల కోసమే ప్రతి వీకెండ్లో కిట్టిపార్టీలు శిల్పా ఏర్పాటు చేసినట్లు బాధితులు తెలిపారు. మోసపోయామని బాధితులు పీఎస్లో ఫిర్యాదు చేస్తున్నిరు. నార్సింగ్ పీఎస్లో శిల్పా చౌదరిపై మొత్తం 3 కేసులు నమోదు చేశారు.
శిల్పా చౌదరిని తిరిగి కస్టడీలోకి తీసుకుంటామని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. కస్టడీ పిటిషన్పై ఇవాళ కోర్టులో వాదనలు పూర్తయ్యాయని, శిల్పాకు సంబంధించి రెండు అకౌంట్లను ఫ్రీజ్ చేశామన్నారు. మరికొన్ని అకౌంట్లు ఉన్నట్లు గుర్తించామని, డబ్బును శిల్ప ఎక్కడకి తరలించారనే దానిపై విచారిస్తున్నామని వెంకటేశ్వర్లు తెలిపారు.