బస్సులోనే షెల్టర్
ABN , First Publish Date - 2021-06-20T10:51:58+05:30 IST
ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ అధికారులు బస్సులోనే షెల్టర్ను ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో ఎన్టీఆర్ చౌరస్తా ప్రాంతంలోని బస్టా్పలో ఈ షెల్టర్ను ఏర్పాటు చేశారు.
ఏర్పాటు చేసిన ఖమ్మం ఆర్టీసీ అధికారులు
ఖమ్మం ఖానాపురం హవేలీ, జూన్ 19: ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ అధికారులు బస్సులోనే షెల్టర్ను ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో ఎన్టీఆర్ చౌరస్తా ప్రాంతంలోని బస్టా్పలో ఈ షెల్టర్ను ఏర్పాటు చేశారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆదేశాలతో బస్ షెల్టర్లు లేని ప్రాంతాల్లో ప్రయాణికులు వేచి ఉండేందుకు తాత్కాలికంగా బస్సులను ఏర్పాటు చేశారు. పక్కా నిర్మాణాలు లేని చోట ఇలా బస్సులను ఏర్పాటు చేయడంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ షెల్టర్లో తాగునీటి సదుపాయం కల్పించామని ఆర్టీసీ సీఐ స్వామి తెలిపారు.