అంతర్జాతీయ పోటీలకు షేక్‌ బాజి

ABN , First Publish Date - 2022-08-14T05:15:30+05:30 IST

టర్కీలో జరగనున్న వరల్డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ ఒలింపిక్‌ ఛాం పియన్‌ షిప్‌ పోటీలకు రాయలసీమ వ్యా యామ కళాశాల బీపీఎడ్‌ విద్యార్థి షేక్‌ బాజి ఎంపికైనట్లు తెలిపారు.

అంతర్జాతీయ పోటీలకు షేక్‌ బాజి
మాట్లాడుతున్న షేక్‌ బాజి

ప్రొద్దుటూరు టౌన్‌, ఆగస్టు 13: టర్కీలో జరగనున్న వరల్డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ ఒలింపిక్‌ ఛాం పియన్‌ షిప్‌ పోటీలకు రాయలసీమ వ్యా యామ కళాశాల బీపీఎడ్‌ విద్యార్థి షేక్‌ బాజి ఎంపికైనట్లు తెలిపారు. ఆయన ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడుతూ సెప్టెంబర్‌ 5 నుంచి 18వ తేదీ వరకు  పోటీలు జరుగుతా యన్నారు. జూలై 2, 3 తేదీల్లో బెంగుళూరు లో జరిగిన జాతీయస్థాయి తైక్వాండో పోటీ ల్లో బంగారు పతకం సాధించినట్లు తెలిపా రు.

మే 7, 8, 9 తేదీల్లో గోవాలో జరిగిన సెకండ్‌ స్కూల్‌ గేమ్స్‌ అండ్‌ యాక్టివిటీ డెవల్‌పమెంట్‌ ఫెడరేషన్‌ పోటీల్లో బంగారు పతకం సాధించానని వివరించారు. మే 28 నుంచి 30 వరకు నేపాల్‌లో జరిగిన నేపాల్‌ ఇంటర్నేషనల్‌ టోర్నమెంట్‌లో బంగారు పతకం సాధించానన్నారు. ఎస్‌ఏఎ్‌ఫఏఎస్‌ ప్రధాన కార్యదర్శి అర్పన్‌ సింగ్‌, టర్కీలో జరిగే పోటీలకు తనను ఎంపిక చేశారని తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు అయ్యే మొత్తం ఖర్చును సినీ నటులు రవితేజ, అలీ భరించనున్నారని, వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో తైక్వాండో కోచ్‌ శ్రీనివాసులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-14T05:15:30+05:30 IST