కుక్కల దాడిలో గొర్రెలు మృతి
ABN , First Publish Date - 2022-06-29T05:15:31+05:30 IST
మండలపరిధిలోని ఇన్ముల్నర్వ గ్రామానికి
కొత్తూర్, జూన్ 28: మండలపరిధిలోని ఇన్ముల్నర్వ గ్రామానికి చెందిన నవీన్, శ్యామ్లకు చెందిన గొర్రెల మందపై సోమవారం రాత్రి కుక్కలు దాడి చేయగా, 15గొర్రెలు మృత్యువాతపడ్డాయి. గొర్రెలను మందలో ఉంచి ఇంటికి వెళ్లామని, ఉదయం వచ్చి చూసేసరికి గొర్రెలు కుక్కుల దాడిలో మృతిచెంది ఉన్నాయని బాధితులు తెలిపారు. గొర్రెలమంద పక్కన ఉన్న వెంచర్లలో కొందరు మద్యంతోపాటు మాంసాహారం సేవిస్తుండడంతో కుక్కలు అక్కడకు చేరుకుంటున్నాయని పేర్కొన్నారు. మృతి చెందిన గొర్రెల విలువ లక్షాయాభై వేల రూపాయలు ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.