మీ అన్నతో మాట్లాడంటూ ఫోన్‌ ఇచ్చిన వదిన.. అవతలి వ్యక్తి గొంతు విని ఆ చెల్లికి డౌట్.. పోలీసుల ఎంట్రీతో చివరకు ఊహించని ట్విస్ట్..!

ABN , First Publish Date - 2022-08-13T18:06:47+05:30 IST

మధ్యప్రదేశ్‌లోని మొరెనాలో ఒక మహిళ...

మీ అన్నతో మాట్లాడంటూ ఫోన్‌ ఇచ్చిన వదిన.. అవతలి వ్యక్తి గొంతు విని ఆ చెల్లికి డౌట్.. పోలీసుల ఎంట్రీతో చివరకు ఊహించని ట్విస్ట్..!

మధ్యప్రదేశ్‌లోని మొరెనాలో ఒక మహిళ ప్రేమికుడితో కలిసి భర్తను హత్య చేసింది. హత్య జరిగిన తీరు పోలీసులకు త్వరగా అంతుచిక్కలేదు. భర్తకు నిద్రమాత్రలు తినిపించిన తర్వాత సజీవంగా కాలువలో పడేశారు. కుళ్లిపోయిన మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు దానిని అనాథశవంగా గుర్తించి పూడ్చిపెట్టారు.  మీ కొడుకు దూరపు పనికి వెళ్లాడని నిందితురాలు వృద్ధురాలైన అత్తకు చెప్పింది.  ఈ ఘటన సింఘౌనియన్ ప్రాంతంలోని ఛత్ కా పురా గ్రామంలో జరిగింది. విశ్వనాథ్ సఖ్వార్ తన తల్లి భార్యతో ఉంటున్నాడు. విశ్వనాథ్ భార్య వారి పొలంలో పనిచేస్తున్న అరవింద్‌తో సంబంధం పెట్టుకుంది. భర్త లేని సమయంలో అరవింద్ ఆమె ఇంటికి వచ్చేవాడు. అయితే విశ్వనాథ్‌ తన సంబంధానికి అడ్డుగా ఉన్నాడని వారిద్దరూ అతనిని చంపడానికి కుట్ర పన్నారు.  అతని చేత నిద్రమాత్రలు తినిపించి సిక్రౌడ కాలువలో పడవేశారు. భర్త హత్య జరిగిన ఏడు నెలల తర్వాత నిందితురాలు తన అత్తవారించి నుంచి నుంచి వెళ్లిపోయింది. మొరెనా నగరానికి వచ్చి, ప్రియుడు అరవింద్‌తో కలిసి ఉంటోంది. అయితే అత్త... కొడుకు గురించి ఆమెను అడిగేది. దీంతో ఆమె తన ప్రేమికుడితో మాట్లాడించి తప్పుదారి పట్టించేది. ఇదిలావుండగా సిక్రౌడా కాలువలో గుర్తు తెలియని మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు.


మృతదేహాన్ని చేపలు తిన్నందున గుర్తించలేకపోయాయి, అనాథ మృత దేహంగా భావించి పూడ్చిపెట్టారు. ఇదిలావుండగా విశ్వనాథ్ సోదరి వందన నిందితురానికి తన సోదరుడి పోన్ నంబర్‌ను అడిగింది. ఆ వాయిస్ తన సోదరుడిది కాదని ఆమెకు అనుమానం వచ్చింది. ఆమె తన తల్లితో కలిసి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని విషయమంతా చెప్పింది. విశ్వనాథ్ భార్యను విచారించిన పోలీసులు.. ఫోన్‌లో భర్తతో మాట్లాడాలని కోరారు. పోలీసులు ఫోన్ చేయడంతో భయాందోళనకు గురైన అరవింద్ కాల్ డిస్‌కనెక్ట్ చేశాడు. పోలీసులు సైబర్ సెల్‌ సాయంతో ఆ ఫోనును ట్రేస్ చేశారు. దీంతో పోలీసుల అనుమానం బలపడింది. పోలీసులు నిందితురాలిని, ఆమె ప్రేమికుడిని అదుపులోకి తీసుకుని వారిని విచారించగా, వారు తమ తప్పును అంగీకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-08-13T18:06:47+05:30 IST