శత్రుఘ్నుసిన్హా, బాబుల్ సుప్రియోకు టీఎంసీ లోక్‌సభ టిక్కెట్లు

ABN , First Publish Date - 2022-03-13T19:05:28+05:30 IST

లోక్‌సభ ఉప ఎన్నికల్లో బాలీవుడ్ సీనియర్ నటుడు శత్రుఘ్నుసిన్హా, గాయకుడు బాబుల్ సుప్రియోలు..

శత్రుఘ్నుసిన్హా, బాబుల్ సుప్రియోకు టీఎంసీ లోక్‌సభ టిక్కెట్లు

కోల్‌కతా: లోక్‌సభ ఉప ఎన్నికల్లో బాలీవుడ్ సీనియర్ నటుడు శత్రుఘ్నుసిన్హా, గాయకుడు బాబుల్ సుప్రియోలు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) టిక్కెట్టుపై పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదివారంనాడు ప్రకటించారు. అసాన్‌సోల్ నుంచి సిన్హా, బల్లీగంజ్ నుంచి సుప్రియో పోటీ చేయనున్నారు.


''కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ నటుడు శత్రుఘ్నుసిన్హా లోక్‌సభ ఎన్నికల్లో అసాన్‌సోల్ నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారని టీఎంసీ తరఫున ప్రకటించడానికి చాలా సంతోషంగా ఉంది. అలాగే, బల్లీగంజ్‌ నుంచి కేంద్ర మాజీ మంత్రి, గాయకుడు బాబుల్ సుప్రియో పోటీ చేస్తారు. జై హింద్, జై బంగ్లా, జై మా-మాటి-మానుష్'' అని వరుస ట్వీట్లలో మమతా బెనర్జీ ప్రకటించారు.

Updated Date - 2022-03-13T19:05:28+05:30 IST