Shashikala బీజేపీలో చేరితే సాదరంగా ఆహ్వానిస్తాం
ABN , First Publish Date - 2022-06-02T15:42:27+05:30 IST
అన్నాడీఎంకే అసమ్మతివర్గం నాయకురాలు శశికళ తమ పార్టీలో చేరితే సాదరంగా ఆహ్వానిస్తామని బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు, మాజీ మంత్రి
- నయినార్ నాగేంద్రన్
చెన్నై, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): అన్నాడీఎంకే అసమ్మతివర్గం నాయకురాలు శశికళ తమ పార్టీలో చేరితే సాదరంగా ఆహ్వానిస్తామని బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు, మాజీ మంత్రి నయినార్ నాగేంద్రన్ ప్రకటించారు. పుదుకోటలో బుధవారం ఉదయం జరిగిన ఓ వివాహ వేడుకల్లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ శశికళను అన్నాడీఎంకేలో చేర్చుకుంటే ఆ పార్టీ తప్పకుండా అభివృద్ధి చెందగలదన్నారు. ఒక వేళ అన్నాడీఎంకేలో శశికళను చేర్చుకోకపోతే బీజేపీలో చేరితే తాము సాదరంగా ఆహ్వానిస్తామని పేర్కొన్నారు. గత కొన్ని నెలలుగా పెట్రోలు, డీజిల్ ధరలను ఎందుకు తగ్గించలేదంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన డీఎంకే పాలకులు, ప్రస్తుతం కేంద్రం వాటి ధరలను తగ్గించటంతో ఖంగుతిన్నారని, రాష్ట్ర ప్రభుత్వం తనవంతుగా పెట్రోలు, డీజిల్పై సుంకాన్ని తగ్గించడానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గర్హనీయమన్నారు. డీఎంకే నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని ‘యూనియన్ ప్రభుత్వం’ అంటూ అదే పనిగా సంబోధించడం గర్వంగా భావిస్తున్నారని చెప్పారు.