భర్తకు చిన్నమ్మ నివాళి

ABN , First Publish Date - 2022-03-21T13:41:34+05:30 IST

అన్నాడీఎంకే అసమ్మతివర్గం నాయకురాలు వీకే శశికళ ఆదివారం ఉదయం తన భర్త ఎం.నటరాజన్‌ నాలుగో వర్ధంతి సందర్భంగా తంజావూరులోని ఆయన సమాధి వద్ద

భర్తకు చిన్నమ్మ నివాళి

చెన్నై: అన్నాడీఎంకే అసమ్మతివర్గం నాయకురాలు వీకే శశికళ ఆదివారం ఉదయం తన భర్త ఎం.నటరాజన్‌ నాలుగో వర్ధంతి సందర్భంగా తంజావూరులోని ఆయన సమాధి వద్ద ఘననివాళులర్పించారు. తంజావూరు వినార్‌రోడ్డులో ఉన్న నటరాజన్‌ సమాధి దగ్గరకు తన అనుచరులతో కలిసి శశికళ చేరుకుని నివాళులర్పించారు. ఆ సందర్భంగా ఆమె గోపూజ కూడా నిర్వహించి దీపారాధన చేశారు. ఈ కార్యక్రమంలో శశికళతోపాటు అన్నాడీఎంకే సమన్వయకర్త ఒ.పన్నీర్‌సెల్వం సోదరుడు ఒ.రాజా, తిరుచ్చి మాజీ మేయర్‌ చారుబాలా ఆర్‌ తొండైమాన్‌, ప్రముఖ సినీనటి సీఆర్‌ సరస్వతి తదితరులు పాల్గొన్నారు. వీరంతా శశికళ పక్కనే నిలబడి ఫొటోలు కూడా తీసుకున్నారు. ఇదే విధంగా అన్నాడీఎంకే స్థానిక మాజీ నాయకులు, మహిళా విభాగాల సభ్యులు కూడా శశికళతో ఫొటోలు దిగారు. భర్త వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ నెల 17న తంజావూరు చేరుకున్న శశికళ పరిశుద్ధం నగర్‌లోని నివాసంలో బసచేశారు. ఆదివారం రాత్రి వరకూ ఆమె తంజావూరులోనే ఉంటారు. సోమవారం ఉదయం తంజావూరు నుంచి బయలుదేరి కుంభకోణం వెళ్లి అక్కడ ప్రముఖ దేవాలయాలను సందర్శించనున్నారు. 

Updated Date - 2022-03-21T13:41:34+05:30 IST