వ్యవసాయ కార్మికులతో శశికళ మాటామంతి

ABN , First Publish Date - 2021-10-28T16:06:08+05:30 IST

తంజావూరు మారియమ్మన్‌ ఆలయ సమీపంలోని పొలాల్లో పనిచేస్తున్న మహిళా వ్యవసాయ కార్మికుల వద్దకు వెళ్లిన శశికళ, వారి యోగక్షేమాలు విచారించారు. అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ మళ్లీ పార్టీలోకి వచ్చేందుకు

వ్యవసాయ కార్మికులతో శశికళ మాటామంతి

పెరంబూర్‌(Chennai): తంజావూరు మారియమ్మన్‌ ఆలయ సమీపంలోని పొలాల్లో పనిచేస్తున్న మహిళా వ్యవసాయ కార్మికుల వద్దకు వెళ్లిన శశికళ, వారి యోగక్షేమాలు విచారించారు. అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ మళ్లీ పార్టీలోకి వచ్చేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. శశికళను తిరిగి పార్టీలోకి చేర్చుకొనే విషయమై పార్టీ అధిష్ఠానంలో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో, డెల్టా జిల్లాల్లో శశికళ తన పర్యటన ప్రారంభించారు. తంజావూరు సమీపంలోని పూండిపుష్పం కళాశాలలో బుధవారం టీటీవీ దినకరన్‌ కుమార్తె రిసెప్షన్‌కు శశికళ హాజరయ్యారు. కార్యక్రమం ముగించుకొని మధ్యాహ్నం 12 గంటలకు తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో మారియమ్మన్‌ ఆలయ సమీపంలోని పొలాల్లో పనిచేస్తున్న కార్మికులను గమనించి ఆమె, కారును ఆపి కార్మికుల వద్దకు వెళ్లి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కారులో పూండికి వెళ్లారు.

Updated Date - 2021-10-28T16:06:08+05:30 IST