మోదీపై ప్రశంసల వర్షం కురిపించిన శశి థరూర్

ABN , First Publish Date - 2022-03-15T01:28:43+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయనను ‘శక్తిమంతమైన

మోదీపై ప్రశంసల వర్షం కురిపించిన శశి థరూర్

జైపూర్: ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయనను ‘శక్తిమంతమైన, చైతన్యం కలిగిన’ వ్యక్తిగా అభివర్ణించారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయాన్ని ఆయన ఘనతగా పేర్కొన్నారు. రాజకీయంగా ఆకట్టుకునే కొన్ని పనులను మోదీ చేశారని పేర్కొన్నారు.


అయినప్పటికీ ఇంత పెద్ద తేడాతో గెలుస్తారని ఊహించలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్‌లో పాల్గొన్న థరూర్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.ఉత్తరప్రదేశ్ ఎన్నికలపై మాట్లాడుతూ.. ఏదో ఒక రోజు బీజేపీని ఓటరు ఆశ్చర్యపరుస్తాడని అన్నారు. అయితే, ఇప్పుడు మాత్రం వారు వారు కోరుకున్న తీర్పే ఇచ్చారని అన్నారు. 


మోదీని పొడిగిన వెంటనే తీవ్ర విమర్శలు కూడా చేశారు. దేశాన్ని మత ప్రాతిపదికన విభజించే శక్తులను సమాజంలోకి చొప్పిస్తున్నారని అన్నారు. తన అభిప్రాయం ప్రకారం ఇదొక విషమని, ఇది చాలా దురదృష్టకరమని అన్నారు. యూపీ ఎన్నికల ఫలితాలను రాజకీయ విశ్లేషకులు ‘ముందస్తు ముగింపు’గా పేర్కొనడం తనను ఆశ్చర్యపరిచిందన్నారు. ఎగ్జిట్ పోల్స్ రాకముందు వరకు బీజేపీ గెలుస్తుందని అతికొద్ది మంది మాత్రమే అంచనా వేశారని శశిథరూర్ అన్నారు.  


Updated Date - 2022-03-15T01:28:43+05:30 IST