ఐసీసీ ఛైర్మన్ పదవిలో కొనసాగేందుకు ఆసక్తి చూపని శశాంక్ మనోహర్

ABN , First Publish Date - 2020-05-28T02:32:09+05:30 IST

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ఛైర్మన్ పదివిలో కొనసాగేందుకు శశాంక్ మనోహర్ ఆసక్తి చూపించడం లేదట. తన పదవికాలం ముగిసిన తర్వాత ఆ పదవి నుంచి

ఐసీసీ ఛైర్మన్ పదవిలో కొనసాగేందుకు ఆసక్తి చూపని శశాంక్ మనోహర్

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ఛైర్మన్ పదివిలో కొనసాగేందుకు శశాంక్ మనోహర్ ఆసక్తి చూపించడం లేదట. తన పదవికాలం ముగిసిన తర్వాత ఆ పదవి నుంచి తప్పుకొనేందుకు ఆయన సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ తర్వాత ఛైర్మన్ కోసం ఐసీసీ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ కోలిన్‌ గ్రేవ్స్‌కి ఎక్కువ శాతం మద్దతు లభించే అవకాశం ఉంది. 


‘‘ఎన్నికలపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. వచ్చే గురువారం జరిగే ఐసీసీ బోర్డు మీటింగ్‌లో ఈ అంశంపై చర్చ జరిగిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటాము. ప్రస్తుతం ఛైర్మన్‌ పదవిలో ఉన్న ఆయన(శశాంక్ మనోనార్) అందులో కొనసాగేందుకు ఆసక్తి చూపించడం లేదు. బోర్డు ప్రశాంతంగా మార్పు చేసేందుకు ఆయన సహకరిస్తామని అన్నారు’’ అని ఐసీసీ ప్రకటనలో తెలిపింది. 


2016లో ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికైన శశాంక్ మనోహర్.. ఆ తర్వాత కొన్ని వ్యక్తిగత కారణల వల్ల ఆ పదవికి రాజీనామా చేశారు. 2018లో ఆయన మరోసారి ఆ పదవికి ఎంపిక అయ్యారు. 

Updated Date - 2020-05-28T02:32:09+05:30 IST