చందానగర్లో ‘శర్వాణి శ్రీ హేమదుర్గా ప్యారడైజ్’
ABN , First Publish Date - 2022-06-25T09:08:56+05:30 IST
ఎంఎంటీఎస్తో చందానగర్ రూపురేఖలు మారిపోతున్నాయి. హైటెక్ సిటీ కూడా దగ్గర్లో ఉండడంతో ఐటీ ఉద్యోగులూ ఈ ప్రాంతంపై ఆసక్తి చూపిస్తున్నారు.
ఎంఎంటీఎస్తో చందానగర్ రూపురేఖలు మారిపోతున్నాయి. హైటెక్ సిటీ కూడా దగ్గర్లో ఉండడంతో ఐటీ ఉద్యోగులూ ఈ ప్రాంతంపై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే అనేక వెంచర్లు వచ్చాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ నిర్మాణ సంస్థ శర్వాణి వెంచర్స్ అండ్ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్.. చందానగర్లో ‘శర్వాణి శ్రీ హేమదుర్గ ప్యారడైజ్’ పేరుతో కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించింది. ప్రాజెక్ట్లో భాగంగా 8 ఎకరాల్లో 6 టవర్లతో 1,154 డబుల్, ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు నిర్మిస్తోంది. వచ్చే ఏడాది డిసెంబరు నాటికి ఈ ప్రీమియం రెసిడెన్షియల్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ పూర్తి కానుంది. ఈ ప్రాజెక్ట్లో ఇప్పటికే ఫ్లాట్ల బుకింగ్ ప్రారంభమైంది. ఎస్ఎఫ్టీ ధర రూ.6,499. కొనుగోలుదారులు 20 శాతం డౌన్పేమెంట్ చేస్తే మిగతా 80 శాతం బ్యాంక్ లోన్ ద్వారా లభిస్తుంది. డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లను 1037-1,377 ఎస్ఎఫ్టీ విస్తీర్ణంలో, ట్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లను 1,650-1,999 ఎస్ఎఫ్టీ విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. అన్ని అనుమతులతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు అనేక ప్రత్యేకతలతో సిద్ధమవుతోంది.