బీసీలంటే దొర మీటింగ్‌లకు మందిని తెచ్చేవారు: షర్మిల

ABN , First Publish Date - 2022-01-17T19:58:08+05:30 IST

బీసీలంటే దొర మీటింగులకు మందిని తెచ్చేవారని దొర గెలిచేందుకు ఓట్లేసే ఓటర్లు తప్ప బీసీలు దొరకు అక్కర లేదని వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ట్విటర్ వేదికగా విమర్శించారు.

బీసీలంటే దొర మీటింగ్‌లకు మందిని తెచ్చేవారు: షర్మిల

అమరావతి : బీసీలంటే దొర మీటింగులకు మందిని తెచ్చేవారని దొర గెలిచేందుకు ఓట్లేసే ఓటర్లు తప్ప బీసీలు దొరకు అక్కర లేదని వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ట్విటర్ వేదికగా విమర్శించారు. బీసీల సంక్షేమంపై పట్టింపు లేదన్నారు. ‘‘బీసీలంటే దొర మీటింగులకు మందిని తెచ్చేవారు.. దొర గెలిచేందుకు ఓట్లేసే ఓటర్లు తప్ప బీసీలు దొరకు అక్కర లేదు. ధనిక రాష్ట్రం అని చెప్పుకునే దొరకు బీసీలకు లోన్లు ఇవ్వడానికి పైసలు ఉండవు. బీసీ బిడ్డల ఫీజులు కట్టేందుకు పైసలు ఉండవు. ఆత్మగౌరవ భవనాలు అని ముగ్గు పోసి వదిలేసి.. మురిపించి వాడుకోవడం.. సంఘాల పేరుతో విభజించడం తప్ప. బీసీల జనాభా ప్రాతిపదికన వాళ్లకు సీట్లు కేటాయించకుండా... వారికి పదవులు ఇవ్వకుండా మోసం చేస్తున్న సర్కార్ ఇది.. బీసీల కనీస అవసరాలు తీర్చలేని చేతకాని ముఖ్యమంత్రి మనకొద్దు’’ అని షర్మిల ట్వీట్‌లో పేర్కొన్నారు.

Updated Date - 2022-01-17T19:58:08+05:30 IST