టీఆర్‌ఎస్ నేతలపై మండిపడ్డ షర్మిల

ABN , First Publish Date - 2022-02-28T22:36:11+05:30 IST

టీఆర్‌ఎస్ నాయకులు వైఎస్‌‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల మండిపడ్డారు. టీఆర్‌ఎస్ నాయకులు లంచంగా అమ్మాయిల మానాన్ని అడుగుతున్నారని ధ్వజమెత్తారు.

టీఆర్‌ఎస్ నేతలపై మండిపడ్డ షర్మిల

హైదరాబాద్: టీఆర్‌ఎస్ నాయకులు వైఎస్‌‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల మండిపడ్డారు. టీఆర్‌ఎస్ నాయకులు లంచంగా అమ్మాయిల మానాన్ని అడుగుతున్నారని ధ్వజమెత్తారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇళ్లిప్పిస్తామని అమాయక అమ్మాయిలను లోబర్చుకుంటున్నారని ఆరోపించారు. కంచే చేను మేసిందన్నట్లు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వంలోని పెద్దలే.. గద్దల్లా అమ్మాయిల మాన ప్రాణాలు పీక్కుతింటున్నారని మండిపడ్డారు. ఇంకెక్కడిది మహిళలకు రక్షణ? అని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు ఎన్నిజరిగినా.. టీఆర్‌ఎస్ నేతల తప్పులు ఆ పార్టీ పెద్దలకు కళ్లకు కనపడవని షర్మిల అన్నారు. 

Updated Date - 2022-02-28T22:36:11+05:30 IST