షర్మిల బహిరంగ సభను విజయవంతం చేయాలి

ABN , First Publish Date - 2022-07-01T06:46:50+05:30 IST

హుజూర్‌నగర్‌లో ఈనెల 4న నిర్వహించనున్న షర్మిల బహిరంగ సభను విజయవంతం చేయాలని వైఎస్సార్‌టీపీ జిల్లా ఉపాఽధ్యక్షుడు కామిశెట్టి రవికుమార్‌, మండల అధ్యక్షుడు సుతారి శ్రీనివాస్‌, రైతు సంఘం మండల అధ్యక్షుడు మర్రి రవీందర్‌రెడ్డి కోరారు.

షర్మిల బహిరంగ సభను విజయవంతం చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న రవికుమార్‌

హుజూర్‌నగర్‌ , జూన్‌ 30: హుజూర్‌నగర్‌లో ఈనెల 4న నిర్వహించనున్న షర్మిల బహిరంగ సభను విజయవంతం చేయాలని వైఎస్సార్‌టీపీ జిల్లా ఉపాఽధ్యక్షుడు కామిశెట్టి రవికుమార్‌, మండల అధ్యక్షుడు సుతారి శ్రీనివాస్‌, రైతు సంఘం మండల అధ్యక్షుడు మర్రి రవీందర్‌రెడ్డి కోరారు. గురువారం హుజూర్‌నగర్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గంలో ఈ నెల ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు  షర్మిల పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పబ్లిక్‌ క్లబ్‌ ఆవరణలో షర్మిల సభ ఉంటుందన్నారు. సమావేశంలో సైదిరెడ్డి, కోటిరెడ్డి, రవి, గోవర్ధన్‌రెడ్డి, ఖలీల్‌, రాజు, మురళి, యశోద, లక్ష్మి, శైలజ, రమణ, సుభద్ర, బుచ్చమ్మ, సునీత, యాకమ్మ, నాగలక్ష్మి , అనూష, ఉపేంద్ర, రాంబాబు, విజయ్‌, రఫీ పాల్గొన్నారు. 



Updated Date - 2022-07-01T06:46:50+05:30 IST