ప్రతి మంగళవారం షర్మిల ఉద్యోగ దీక్ష
ABN , First Publish Date - 2021-07-11T03:28:14+05:30 IST
వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఇకపై ప్రతి మంగళవారం ఉద్యోగ దీక్ష చేపడుతారని
హైదరాబాద్: వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఇకపై ప్రతి మంగళవారం ఉద్యోగ దీక్ష చేపడుతారని ఆ పార్టీ నాయకురాలు ఇందిరా శోభన్ తెలిపారు. ఉద్యోగ నోటిఫికేషన్లు లేక చనిపోయిన నిరుద్యోగులకు సంఘీభావంగా వారి ఇంటి దగ్గరే దీక్ష చేపడుతారని ఇందిర పేర్కొన్నారు. నోటిఫికేషన్లు విడుదలయ్యేవరకు ఉద్యోగ పోరాటం కొనసాగుతుందని ఆమె పేర్కొన్నారు.