రేపు ఇడుపులపాయకు షర్మిల

ABN , First Publish Date - 2021-10-19T01:48:32+05:30 IST

వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మంగళవారం ఇడుపులపాయకు రానున్నారు. వైఎస్సార్‌టీపీని అధికారికంగా ప్రకటించి వంద రోజులు

రేపు ఇడుపులపాయకు షర్మిల

కడప: వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మంగళవారం ఇడుపులపాయకు రానున్నారు. వైఎస్సార్‌టీపీని అధికారికంగా ప్రకటించి వంద రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈనెల 20వ తేదీన చేవెళ్ల నుంచి ప్రజాప్రస్థానం పేరిట పాదయాత్రకు వైఎస్‌ షర్మిల శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఇడుపులపాయలో తన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించనున్నారు. వైఎస్‌ షర్మిలతో పాటు తల్లి విజయలక్ష్మి కూడా రానున్నారు. మంగళవారం ఉదయం కడప విమానాశ్రయం చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఇడుపులపాయకు చేరుకుంటారు. తండ్రి సమాధికి నివాళులు అర్పించిన అనంతరం గెస్ట్‌హౌస్‌లో బస చేస్తారు. తిరిగి సాయంత్రం ఇడుపులపాయ నుంచి హైదరాబాద్‌కు వెళ్లనున్నారు.

Updated Date - 2021-10-19T01:48:32+05:30 IST