నిరుద్యోగుల హంతకుడు కేసీఆర్: షర్మిల

ABN , First Publish Date - 2021-08-18T01:13:10+05:30 IST

గూడూరు మండలం గుండెంగలో మంగళవారం వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన దీక్ష ముగిసింది.

నిరుద్యోగుల హంతకుడు కేసీఆర్: షర్మిల

మహబూబాబాద్: గూడూరు మండలం గుండెంగలో మంగళవారం వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన దీక్ష ముగిసింది. ఈ దీక్షలో మీడియాతో షర్మిల మాట్లాడారు. నిరుద్యోగుల హంతకుడు సీఎం కేసీఆర్ అన్నారు. చనిపోవడం కాదు...కేసీఆర్ అహంకారాన్ని చంపుదామని పిలిపిచ్చారు. పాలన చేయడం చేతకాకపోతే మత్తులో పడుకోవాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో 5,6 చదివిన వాళ్లు మంత్రులవుతారని ఎద్దేవా చేశారు. డిగ్రీలు, పీజీలు చదివిన వాళ్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా షర్మిల రాత్రికి మహబూబాబాద్‌లో బస చేయనున్నారు. రేపు ములుగు జిల్లాలో షర్మిల పోడు యాత్రలో పాల్గొననున్నారు.

Updated Date - 2021-08-18T01:13:10+05:30 IST