జీవో 317తో ఓ ఉపాధ్యాయుడిని బలి తీసుకున్నారు: షర్మిల

ABN , First Publish Date - 2021-12-31T20:48:36+05:30 IST

టీఆర్ఎస్ ప్రభుత్వంపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తీవ్ర విమర్శలు చేశారు.

జీవో 317తో ఓ ఉపాధ్యాయుడిని బలి తీసుకున్నారు: షర్మిల

హైదరాబాద్‌: టీఆర్ఎస్ ప్రభుత్వంపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, రైతులు చనిపోతున్నా సీఎం కేసీఆర్‌లో చలనం రావడం లేదని ఆరోపించారు. జీవో 317 యమపాశంతో ఓ ఉపాధ్యాయుడిని బలి తీసుకున్నారని, 317 జీవో వల్ల ఉపాధ్యాయులు అయోమయంలో ఉన్నారన్నారు. లేని సమస్యలను సృష్టిస్తూ ముఖ్యమంత్రి ఆడుతున్న రాక్షస క్రీడలో.. ఉపాధ్యాయులను బలిపశువులను చేస్తున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ అనాలోచిత నిర్ణయాలు, అహంకార పోకడలు పక్కనపెట్టాలన్నారు. మరొకరు చనిపోకముందే జీవో 317ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు లేవనెత్తే అంశాలను పరిశీలించి.. శాస్త్రీయ పద్ధతిలో బదిలీలు చేపట్టాలని షర్మిల కోరారు.

Updated Date - 2021-12-31T20:48:36+05:30 IST