తెలంగాణ ప్రభుత్వం దీక్షలు, ధర్నాలతో డ్రామాలు చేస్తోంది: షర్మిల

ABN , First Publish Date - 2021-12-24T21:03:12+05:30 IST

తెలంగాణ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు.

తెలంగాణ ప్రభుత్వం దీక్షలు, ధర్నాలతో డ్రామాలు చేస్తోంది: షర్మిల

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై వైఎస్సార్‌‌ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతులను ఆదుకోవాల్సిన సర్కార్ దీక్షలతో, ధర్నాలతో డ్రామాలు చేస్తోందని ఆరోపించారు. ఏ దిక్కూ లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంట పండక, పెట్టుబడి రాక, అప్పులు తట్టుకోలేక పురుగుల మందు తాగుతున్నారని, రోజుకు ఇద్దరు, ముగ్గురు రైతులు చనిపోతున్నారని అన్నారు. కనీసం ఆ కుటుంబాలను ఓదార్చాలనే సోయి కూడా ముఖ్యమంత్రికి లేదా? అని ప్రశ్నించారు. ఢిల్లీలో రైతులు చనిపోతే ఆదుకోవడానికి లక్షలు ఇచ్చే కేసీఆర్... మన రైతులు చనిపోతే పట్టించుకోవడానికి కనీసం టైం కూడా లేదా? అని నిలదీశారు. రైతులు చనిపోయేలా చేస్తున్న రైతు హంతక ప్రభుత్వమని దుయ్యబట్టారు. రైతును అప్పులపాలు చేస్తున్న ముఖ్యమంత్రి మనకొద్దని, రైతు ఆవేదన తీర్చలేని సీఎం కేసీఆర్ మనకొద్దని షర్మిల అన్నారు.

Updated Date - 2021-12-24T21:03:12+05:30 IST