తెలంగాణ రైతుల చావు కేకలు కేసీఆర్కు వినిపించట్లేదా?: షర్మిల
ABN , First Publish Date - 2022-05-26T09:59:42+05:30 IST
హైదరాబాద్, మే 25 (ఆంధ్రజ్యోతి): పంజాబ్ రైతుల చావులు కనిపించిన కేసీఆర్కు తెలంగాణ రైతుల చావు కేకలు వినిపించట్లేదా అంటూ వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల
హైదరాబాద్, మే 25 (ఆంధ్రజ్యోతి): పంజాబ్ రైతుల చావులు కనిపించిన కేసీఆర్కు తెలంగాణ రైతుల చావు కేకలు వినిపించట్లేదా అంటూ వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల ధ్వజమెత్తారు. ధాన్యం ఎప్పుడు కొంటారోనన్న దిగులుతో కామారెడ్డి జిల్లా సంగమేశ్వర గ్రామంలో సిద్ద రాములు అనే రైతు గుండె ఆగిందన్నారు. ఆఖరి గింజ వరకూ కొంటానని చెప్పి ఇప్పుడు కొనకుండా రైతులను పాడె ఎక్కిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఆమె ట్వీట్ చేశారు.